• బ్యారేజ్ లో పనిచేస్తున్న కూలి గల్లంతైనట్లు సమాచారం
• మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద డ్రిల్లింగ్ ఆపరేటర్ గా పనిచేస్తున్న రాజస్థాన్ వాసిగా గుర్తింపు
• స్థానానికి వెళ్లి బ్యారేజ్ లో గల్లంతయిన ఘటన
• గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం

న్యూస్ డెస్క్ : మెడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో వ్యక్తి గల్లంతయినట్లు తెలుస్తుంది. సోమవారం రోజు 6 గంటల ప్రాంతంలో బ్యారేజీలో పనిచేసే కూలి, స్నానానికి వెళ్లి గల్లంతైనట్లు సమాచారం. లక్ష్మీ బ్యారేజ్ లో డ్రిల్లింగ్ ఆపరేటర్ గా పనిచేస్తున్న రాజస్థాన్ వాసిగా గుర్తింపు. పనులు చేస్తున్న వ్యక్తి స్నానానికి వెళ్లి గల్లంతైన విషయం కాస్త అలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు విశ్వనీయ సమాచారం. వేసవి కాలం కావడంతో బ్యారేజ్ వద్ద చేపడుతున్న పనులను పూర్తి చేసుకున్న ఆ కూలి స్నానానికి వెళ్లి గల్లంతయినట్లు తెలుస్తుంది. బ్యారేజీలో ఒకే వ్యక్తి గల్లంతయ్యాడా లేక అతని వెంట మరెవరైనా కూలీలు ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది.