తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఈస్ట్ సాయి నగర్ కాలనీలో జరుగుతున్న సర్ ఓటు మ్యాపింగ్ కార్యక్రమాన్ని డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ స్థానిక నాయకులతో కలిసి పరివేక్షించారు. ఈ సందర్భంగా దొడ్ల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతు ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్ కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా భాగస్వామి కావాలని కోరారు. బిఎల్ఓలు అందజేసే ఎమ్యూనరేషన్ ఫారంలో తమ పూర్తి వివరాలను సక్రమంగా నమోదు చేసి ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు, బూతు లెవెల్ అధికారులు సర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఉన్న ఓట్లను గుర్తించి తొలగించేందుకు బిఎల్ఓలు కృషి చేయాలని నకిలీ ఓట్లను పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంటే ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటరుగా నమోదు కావడం అత్యంత ముఖ్యమని పేర్కొంటూ, స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, రాజేష్ చంద్ర, పోశెట్టిగౌడ్, నవీన్ రెడ్డి, శ్రీధర్, తోట ప్రవీణ్, త్రినాథ్, సురభి రమేష్ రావు, సంతోష్ బిరాదర్, శేఖర్, రామరాజు, కృష్ణ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
