తెలంగాణ ఎక్స్ ప్రెస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మలిదశ తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తింపు పొందిన పలువురికి ప్రశంసా పత్రాలను ప్రదానంచేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత్ చారి గురువుగారైన శ్రీ కాచం సత్యనారాయణ హాజరై వారి చేతుల మీదుగా ఉద్యమకారులైన గంగారం సంగారెడ్డి, డి.డి. సుబ్బారావు, ముక్కా పృథ్వీ గుప్తలకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
