న్యూస్ డెస్క్ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సుబేదారి, హనుమకొండ ప్రాంగణంలో డైనింగ్ హాల్ శంకుస్థాపన, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ప్రారంభోత్సవం మరియు రెడ్ క్రాస్ మార్గ్ పేరు బోర్డు ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా DCC అధ్యక్షులు, వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ డాక్టర్ పి.విజయచందర్ రెడ్డి పాల్గొని శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు.

ఈ కార్యక్రమంలో గుజ్జుల వసంత (59వ డివిజన్ కార్పొరేటర్), ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్లు ఎన్. రవి, ఇ.వి.శ్రీనివాస్ రావు, పెద్ది వెంకటనారాయణ గౌడ్, పాపి రెడ్డి, మరియు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, బంక సంపత్, నాయిని లక్ష్మా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
